దివ్యాంగులు, వయోవృద్ధులకు జీవన పరికరాలు పంపిణీకి నిర్ధారణ శిబిరం
Featured Latest Popular- Est 1 min
- 0 Views
- 3 days ago
అత్యంత వైభవంగా శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవం..
Latest Popular- Est 1 min
- 0 Views
- 3 days ago
ప్రజల సమస్యలకు పరిష్కార వేదికగా “పబ్లిక్ గ్రీవిన్స్ రిడ్రెస్సల్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కారం)” కార్యక్రమం…
Featured Latest Popular- Est 1 min
- 0 Views
- 3 days ago
నాయుడుపేట మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులకు 8 నెలలుగా జీతాలు బకాయి – వెంటనే చెల్లించాలి
Featured Latest Popular- Est 1 min
- 0 Views
- 3 days ago
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (PGRS ) ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
Featured Latest Popular- Est 1 min
- 0 Views
- 3 days ago
Top 10 News
దివ్యాంగులు, వయోవృద్ధులకు జీవన పరికరాలు పంపిణీకి నిర్ధారణ శిబిరం
అత్యంత వైభవంగా శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవం..
మే 17వ తేదీన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు
నాయుడుపేట మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులకు 8 నెలలుగా జీతాలు బకాయి – వెంటనే చెల్లించాలి
ఈ నెల 11న త్రాగునీటి సరఫరాకు అంతరాయం.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (PGRS ) ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
Sport
News
Recent
Posts
కడపలో వైకాపాకు భారీ షాక్..

కడపలో వైకాపాకు భారీ షాక్..
చేరిన 300 కుటుంబాలు..
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు, ఎమ్మెల్యే మాధవి రెడ్డి గారి సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ కార్పొరేటర్ ఓర్సు బాల కొండయ్య మరియు వారి అనుచరులు..
కడప నగర అభివృద్ధి మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంపై నమ్మకంతో వైకాపాకు చెందిన ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీగా తెలుగుదేశం పార్టీ బాట పడుతున్నారు. కడప నగరంలో తెలుగుదేశం పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణకు ఈరోజు జరిగిన భారీ చేరికలే నిదర్శనం.
2వ డివిజన్, చలామా రెడ్డి పల్లికి చెందిన వైసీపీ మాజీ కార్పొరేటర్ ఓర్సు బాల కొండయ్య గారి ఆధ్వర్యంలో, భారీ వైసీపీ క్యాడర్ ఈరోజు టీడీపీలో చేరారు. ముఖ్యంగా, బాల కొండయ్య గారితో పాటు సుమారు 300 కుటుంబాలు వైకాపాను వీడి పసుపు జెండాను కప్పుకోవడం నగర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
ఈ భారీ చేరికల కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి గారు మరియు ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి గారు పాల్గొని, వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. కడప అభివృద్ధి కేవలం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారు, కడప నగరంలో తెలుగుదేశం పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణకు ఈ వలసలే నిదర్శనమని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నగర అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేస్తామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కడప స్థానిక టిడిపి కార్పొరేటర్లు, రాష్ట్రస్థాయి నాయకులు, జిల్లా కమిటీ & నగర కమిటీ సభ్యులు,పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
గంజాయి ముఠా వేట…

*గంజాయి ముఠా వేట…*
వరదయ్యపాలెం, సత్యవేడు మండలాలను గంజాయి రహిత మండలాలుగా చేయడమే లక్ష్యంగా ఇద్దరు యువ పోలీస్ అధికారుల టార్గెట్….
*వరదయ్యపాలెం మండలంలో వారం రోజుల వ్యవధిలోని దాదాపు 11 మందిని రిమాండ్కు తరలించిన వరదయ్యపాలెం ఎస్సై మల్లికార్జున నాయుడు…*
*అదే స్థాయిలో సత్యవేడు ఎస్సై సాయినాథ్ చౌదరి… సత్య వేడు మండలాన్ని జల్లెడ పడుతున్న వైనం…*
అభం శుభం తెలియని __ ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువత మత్తుకు బానిస కాకుండా గంజాయి ముఠా ఉచ్చులో యువత బలి కాకుండా యువత కోసం నడుంపించిన ఇద్దరు యువ ఎస్సైలు…
*సులువైన మార్గంలో డబ్బు సంపాదించాలనే క్రమంలో పోరంబోకు ఎదవలు ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతూ అందులో ముఖ్యంగా గంజాయి అమ్మకాలలో లాభాలు విపరీతంగా రావాలని యువతను లక్ష్యంగా చేసుకోవడం దారుణం…*
సేవించిన తర్వాత మధ్యానికి, గంజాయి కి చాలా తేడానే ఉంటాయ్ అంటున్న డాక్టర్లు…
*సాధారణంగా మద్యం సేవించిన తర్వాత మత్తు ఓ మోస్తారు లోనే ఉంటుంది… అదే గంజాయి తీసుకున్న వారికి మత్తు ఏ స్థాయిలో ఉంటుందంటే మద్యం కన్నా విపరీతంగా మత్తు లోకి జారిపోవడమే కాకుండా ఎక్కువ సమయం వరకు ఉండడంతో… అందులోనూ మద్యంతో పోల్చుకుంటే గంజాయి చౌకగా దొరుకుతుండడంతో…. ఈ గంజాయి ముఠా….మత్తుకు బానిస అయిన వాళ్లను తమ వైపుకు తిప్పుకుంటూ గంజాయి మత్తు ఊబిలో కూరుకు పోయేలా తమ ఉచ్చులో బిగుసుకుంటారని విశ్లేషకులు చెబుతుండడం గమనార్హం….*
పక్క నియోజకవర్గము నుండి ముఠా బ్రోకర్ల ద్వారా సత్యవేడు నియోజకవర్గనికి రహస్యంగా తరలిస్తూ డిప్లమా, డిగ్రీ చేస్తున్న విద్యార్థుల తో పాటు యువకులను, నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమలలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికులకు అందిస్తూ లక్షలు సంపాదిస్తూ జల్సాలు చేస్తూ, విలాసవంతంగా గడుపుతూ సమాజంలో చీడపురుగుల్లా తయారైన ఇలాంటివారిని ఏరి వేయడం అత్యంత అవసరం….
*ఇదే ప్రభుత్వ లక్ష్యం కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణలో సీఐ ఆధ్వర్యంలో సత్యవేడు, వరదయ్యపాలెం ఎస్సైలు కంకణం కట్టుకొని జల్లెడ పడుతుండడం కొసమెరుపు…*
*ఈ సందర్భంగా వరదయ్యపాలెం ఎస్సై మల్లికార్జున నాయుడు మాట్లాడుతూ తమ పిల్లల ప్రవర్తన పైన తల్లిదండ్రులు కచ్చితంగా నిఘా పెట్టాలని ఏదైనా తేడాలు గమనిస్తే వెంటనే తమ పిల్లలను అడ్డుకోవాలని లేదా మా సహకారం తీసుకొని మా ద్వారా కౌన్సిలింగ్ ఇప్పిచ్చే ప్రయత్నం చేయాలని… ఈ తరం యువత దేశ భవిష్యత్తు.. కాబట్టి ప్రస్తుత పోటీ సమాజంలో వారికి ఉజ్వల భవిష్యత్తు ఉందనే విషయాన్ని గమనించి భావి భారత పౌరుల్లా ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని…. తెలుపుతూ…. మరోవైపు గంజాయి తరలించే వారికి అమ్మే వారికి అదేవిధంగా గంజాయి కి అలవాటు పడ్డ వారికి ఘాటుగానే హెచ్చరిస్తూ…..పరిధి దాటితే చట్టం రుచి చూడాల్సి వస్తుందని ఎవరిని ఉపేక్షించి వదిలిపెట్టే ప్రసక్తే లేదని చట్టంలోని కఠిన శిక్షణలతో వారిని కటకటాల్లోకి పంపిస్తామని, ఇప్పటికే ఓ ప్రత్యేక బృందం దీన్ని పై మండలంలో పనిచేస్తుందని ఈ తరం యువత ముఖ్యంగా పరిశ్రమలలో పనిచేసే కార్మికులు జాగ్రత్తగా ఉండాలని ఈ గంజాయి ముఠా మభ్యపెట్టే మాటలకు లొంగిపోయి బానిసలు కాకుండా జాగ్రత్త పడాలని జీవితాలు నాశనం చేసుకోవద్దని.. ఆజాగ్రత్తగా ఉంటే కచ్చితంగా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ గంజాయి అమ్మే వారిపై ఉక్కు పాదం మోపామని …. తెగబడే వారిపై అదే స్థాయిలో పోలీసులు కూడా స్పందించడానికి సిద్ధంగా ఉందామని.. సమాజంలో ప్రజల ధన, మాన,ప్రాణాల సంరక్షణే పోలీసుల కర్తవమనే విషయాన్ని తెలుపుతూ మరోసారి హెచ్చరిస్తున్నామని తెలిపారు…*
మరోవైపు
*సత్యవేడు ఎస్సై సాయినాథ్ చౌదరి మాట్లాడుతూ గంజాయి ముఠా సమాజంలో చీడపురుగు లాంటిది… వీరిని అరికట్టడానికి ఎంతకైనా తెగిస్తాం ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు వీరి ఆర్థిక మూలాలను కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు…. ఇది గంజాయి ముఠాకు చివరి హెచ్చరిక…… తస్మాత్ జాగ్రత్త…. సులువైన మార్గంలో డబ్బు సంపాదించి జల్సాలు చేసుకోవాలనుకునే ఈ ముఠాకి చివరిసారిగా హెచ్చరిస్తున్నాం మీ వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయి….. ఉపేక్షించే ప్రసక్తే లేదు వదిలిపెట్టే ప్రసక్తే లేదు…. కచ్చితంగా చట్టం రుచి చూపిస్తాం…. అవసరమనుకుంటే కఠిన చర్యలు కూడా వెనకాడే ప్రసక్తే లేదు… గంజాయి అమ్మే వారిపై తరలించే వారిపై ఎవరైనా సమాచారం ఉంటే తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని ముఖ్యంగా యువత మరియు పరిశ్రమల కార్మికులు జాగ్రత్తగా ఉండాలని మీ కుటుంబాలు మీ తల్లిదండ్రులు మీపై ఎన్నో ఆశలు పెట్టుకొని మీ ఉజ్వల భవిష్యత్తులో వారి సంతోషాన్ని చూసుకునే కలను చెదిరిపోకుండా, చెదరినివ్వకుండా సమాజంలో మరియు కుటుంబంలో బాధ్యతాయుతంగా నడుచుకోవాలని తెలిపారు…*
*ఏది ఏమైనా*
ఈ తరం యువకుల వద్ద ఉన్నది గత తరం వారి వద్ద లేనిది ప్రత్యేకించి గమనించాల్సిన అవసరం ఈతరానికి ఎంతన్నా ఉంది..
ఈ తరం యువకుల వద్ద విలువైన సమయం, పోటీ ప్రపంచంలో అద్భుత అవకాశాలు, ముఖ్యంగా దూకుడు ప్రదర్శించే యవ్వనం…. వీటిని ఉజ్వల భవిష్యత్తు కోసం సామాజికంగా, ఆర్థికంగా స్థిరపడటం కోసం కుటుంబాలలో ఆర్థిక వెలుగులు నింపడం కోసం, సమాజంలో తమదైన ముద్ర వేసుకోవడం కోసం, తమ చురుకైన తెలివిని ఉపయోగించి అంచలంచెలుగా ఎదుగుతూ స్థిరపడడం కోసం ప్రయత్నిస్తే తద్వారా తల్లిదండ్రులకు పుత్రోత్సాహం కలుగుతుంది సమాజానికి మేలు జరుగుతుంది అంతేకానీ…
మత్తుకు బానిసై, లేక ఇతర ఆసాంఘిక కార్యకలాపాలకు అలవాటు పడి విలువైన సమయాన్ని వృధా చేయడం వలన ఇటు సమాజానికి వారితో ఎటువంటి ఉపయోగం లేకపోవడం ఒక ఎత్తైతే మరోవైపు కుటుంబాలు ఛిద్రం అవుతాయనే విషయాన్ని ఈ తరం యువత గమనించాల్సిన అవసరం అత్యంత కీరకం..
*[Ntv_Nayeem _సత్యవేడు]*
దివ్యాంగులు, వయోవృద్ధులకు జీవన పరికరాలు పంపిణీకి నిర్ధారణ శిబిరం

*దివ్యాంగులు, వయోవృద్ధులకు జీవన పరికరాలు పంపిణీకి నిర్ధారణ శిబిరం*
✍️ *ఈనెల 12న పిచ్చాటూరు, కెవిబి పురం, సత్యవేడులలో శిబిరం*
✍️ *పిచ్చాటూరు, కెవిబి పురం లో హాజరుకానున్న ఎమ్మెల్యే ఆదిమూలం*
ఈ నెల 12న దివ్యాంగులు, వయోవృద్ధులకు జీవన పరికరాలు పంపిణీ కొరకు నిర్ధారణ శిబిరం ప్రభుత్వం నిర్వహించనుంది.
గురువారం పిచ్చాటూరు, కెవిబి పురం జడ్పీ హైస్కూల్ లలో తలపెట్టిన ఈ నిర్ధారణ శిబిరం లో గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు పాల్గొంటారు.
ఈ శిబిరం పిచ్చాటూరు, సత్యవేడు లలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, కెవిబి పురం లో ఉదయం 8 నుండి 2 గంటల వరకు నిర్వహిస్తామన్నారు.
*పిచ్చాటూరు శిబిరంలో మండలాలు..*
పిచ్చాటూరు, నాగలాపురం, నారాయణవనం మండలాలకు చెందిన దివ్యాంగులు, వయోవృద్ధులు పిచ్చాటూరు శిబిరం లో పాల్గొనవచ్చు.
*సత్యవేడు శిబిరంలో మండలాలు..*
సత్యవేడు, వరదయ్య పాలెం, బుచ్చి నాయుడు కండ్రిగ మండలాలకు చెందిన దివ్యాంగులు, వయోవృద్ధులు సత్యవేడు శిబిరం లో పాల్గొనవచ్చు.
అలాగే *కెవిబి పురం* మండలానికి చెందిన దివ్యాంగులు, వయోవృద్ధులు మాత్రం అదే మండలం లోని జడ్పీ హైస్కూల్ లో జరిగే నిర్ధారణ శిబిరం లో పాల్గొనవచ్చు.
వయో వృద్ధులకు చేతి కర్రలు, దివ్యాంగులకు చంక కర్రలు, వీల్ చైర్లు, ట్రై సైకిళ్లు వినికిడి యంత్రాలు, రోలేటర్స్, ఎం.ఎస్ కిట్స్, అందులకు చేతి వాచ్, లెప్రసి వ్యాధి గ్రస్తులకు కిట్స్ మొదలగు కృత్రిమ అవయవాలు, పరికరాలు పంపిణీ కొరకు ఈ నిర్ధారణ శిబిరం చేయడమైనది.
ఈ నిర్ధారణ శిబిరానికి హాజరయ్యే *వయో వృద్ధులు* రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఆదాయం ధృవీకరణ పత్రం, నాలుగు ఫోటోలు, మొబైల్ నెంబర్ తో రావాలి, అలాగే *దివ్యాంగులు* UDID కార్డు/రశీదు, సదరం సర్టిఫికెట్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఆదాయం ధృవీకరణ పత్రం, రెండు ఫోటోలు, మొబైల్ నెంబర్ తో శిబిరానికి హాజరు కావాలి.
ఈ అవకాశాన్ని వయోవృద్ధులు దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని *గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు* కోరారు.
*మీడియా మిత్రులకు ప్రత్యేక ఆహ్వానం*
——————————————-
*ఎమ్మెల్యే గారి కార్యాలయం, సత్యవేడు*
——————————————-

